Wednesday, April 24, 2024

Breaking | పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్.. ప్రయాణికులు సేఫ్​

గోదావరి ఎక్స్ ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్ కు వస్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ ఘట్ కేసర్ మండలం అంకుషపుర్ వద్ద పట్టాలు తప్పింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

అయితే రైలు వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కాజీపేట- సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement