Saturday, April 20, 2024

జ‌న‌సంద్ర‌మైన అహ్మ‌దాబాద్‌.. ఫైనల్ మ్యాచ్ కోసం త‌ర‌లివ‌చ్చిన జ‌నం

ఈరోజు IPL ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై, గుజరాత్ త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌ను చూసేందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి లక్ష మందికి పైగా వస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు. చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఇదే ఆఖ‌రి మ్యాచ్ అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మ‌రింత ఎక్కువ జ‌నం వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఇక‌ ఐదో టైటిల్ లక్ష్యంగా చెన్నై బరిలోకి దిగితుండ‌గా… వరుసగా రెండో సారి టైటిల్ కైవ‌సం చేసుకోవాల‌ని గుజరాత్ భావిస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌తో ధోనీ ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించనున్నాడు. ఐపీఎల్‌ లీగ్ లో ధోనీకి ఇది 250వ మ్యాచ్.. టోర్నీ చరిత్రలో ఓ ఆటగాడు 250 మ్యాచ్‌లు ఆడడం ఇదే తొలిసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement