Friday, April 26, 2024

ప్రజాస్వామ్యం గెలిచింది.. ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్‌దే: నామా నాగేశ్వరరావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భవిష్యత్‌లో రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా గెలుపు టీఆర్ఎస్‌దేనని, యావత్ తెలంగాణ సమాజం కేసీఆర్ వెంటేనని మునుగోడు విజయంతో మరోసారి రుజువైందని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో పత్రికా ప్రకటన చేశారు. మునుగోడు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని అందలం ఎక్కించారని హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీపై టీఆర్ఎస్ ధర్మ పోరాటం చేసి అధర్మంపై విజయదుందుభి మోగించిందని అన్నారు.

సీఎం కేసీఆర్ భరోసాతో మునుగోడు ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని ముందుగా ఊహించిందేనని ఎంపీ నామ చెప్పారు.ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి అహంకారం ఓడి ,మునుగోడు ప్రజల ఆత్మ గౌరవం గెలిచిందని అన్నారు.ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలతో నియంతృత్వంతో వ్యవహరించినా టీఆర్ఎస్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందన్నారు. ప్రత్యర్థి పార్టీ కుట్రలకు ఈ తీర్పు చెంప పెట్టులాంటిదని పేర్కొన్నారు. కేవలం డబ్బు, అహంకారంతో పదవికి రాజీనామా చేసి, పార్టీకి ద్రోహం చేసిన ప్రత్యర్ధికి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా మునుగోడులో ధర్మమే గెలిచిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement