Thursday, April 25, 2024

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కి కరోనా

 దేశవ్యాప్తంగా క‌రోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో వేలల్లో క‌రోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కరోనాబారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిందని, స్వ‌ల్పంగా వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని అనిల్ బైజాల్ తెలిపారు. లక్షణాలు బయటిపడినప్పటి నుంచే తాను సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయానని,ఇటీవల తనను కలిసినవాళ్లందరూ టెస్ట్ చేయించుకున్నట్లు తెలిపారు. తన నివాసం నుంచే విధులు నిర్వహిస్తానని, ఢిల్లీలోని పరిస్థితులను తాను తన నివాసం నుంచే సమీక్షిస్తానని లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు.

కాగా, ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రతి రోజూ వేలాది మంది కరోనా బారినపడుతూ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు, సరిపడా ఆక్సిజన్ అందుబాటులోకే పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement