Friday, March 29, 2024

ఢిల్లీకి గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై.. మునుగోడు ఫ‌లితాల అనంత‌రం టూర్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి..

మునుగోడు ఎన్నిక‌ల ఫ‌లితాలు ఊహించ‌ని విధంగా టీఆర్ఎస్ భారీ మెజారిటీ సాధించింది. ఈ త‌రుణంలో తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఢిల్లీ టూర్ పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. గవర్నర్ తమిళిసై ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తమిళిసై భేటీ అవనున్నారు. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులకు ఆమోదం తెలిపే అంశంపై అమిత్ షాతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఢిల్లీ పర్యటనలో ఇతర కేంద్ర మంత్రులను కూడా గవర్నర్ కలవనున్నారు. మునుగోడు ఫలితాల తరువాత గవర్నర్ హస్తిన టూర్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement