Wednesday, April 24, 2024

Breaking: ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారు: సీఎం కేసీఆర్

చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ కొనసాగుతోంది. ఈ సభకి గులాబీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. సీఎం కేసీఆర్ వెంట పైలట్ రోహిత్ రెడ్డి..రేగా కాంతారావు..గువ్వల బాలరాజు..హర్షవర్థన్ రెడ్డి..తరలివచ్చారు. దాంతో మునుగోడు ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కి చేరింది. కేసీఆర్ మాట్లాడుతూ..మునుగోడులో అవసరం లేకుండా ఉప ఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. ఉప ఎన్నిక ఫలితం కూడా ప్రజలు ఎప్పుడో తేల్చేశారని చెప్పారు. న్యాయమేంటో..ధర్మమేంటో ప్రజలకు తెలుసన్నారు.ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారన్నారు.వంద కోట్ల రూపాయలు ఇస్తామని ఆశ చూపించారని దుయ్యబట్టారు. మన ఎమ్మెల్యేలు ఆ ఆఫర్ ని ఎడమకాలితో తన్నారని అన్నారు.రాజకీయమంటే అమ్ముడుపోవడం కాదని నిరూపించారని కొనియాడారు.ఇటువంటి ఎమ్మెల్యేలే రాజకీయాలకి కావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement