Wednesday, April 24, 2024

ట్రీట్మెంట్ ఆలస్యం.. 4 నెల‌ల పాప మృతి.. డాక్ట‌ర్‌తోపాటు న‌ర్సు స‌స్పెన్ష‌న్‌..

డాక్ట‌ర్ల అల‌స‌త్వం కార‌ణంగా నాలుగు నెల‌ల పాప చ‌నిపోయింది. ఈ ఘ‌ట‌న ముంబ‌యిలోని నాయ‌ర్ హాస్పిట‌ల్‌లో ఈరోజు జ‌రిగింది. చికిత్స ఆల‌స్యంతోనే ఆ పాప చ‌నిపోయింద‌ని.. దీనికి బాధ్యులైన ఒక డాక్ట‌ర్‌తోపాటు న‌ర్సును స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు తెలిపారు బీఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ సురేశ్ కాకాని. పాప మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాలు తెలుసుకునేందుకు ఎంక్వైరీ క‌మిటీని వేస్తున్న‌ట్టు తెలిపారు. బాధ్యుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌ద‌ల‌బోమ‌ని, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement