Tuesday, April 23, 2024

వివేకా హత్య కేసులో నిందితుడి పెంపుడు కుక్క మాయం.. భయభ్రాంతుల్లో కుటుంబ సభ్యులు

పులివెందుల, ప్రభన్యూస్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న ఉమాశంకర్‌రెడ్డి ఇంటిలో ఉన్న పెంపుడు కుక్క మాయం కావడంతో భయభ్రాంతులకు గురౌతున్నట్లు ఉమాశంకర్‌ రెడ్డి భార్య స్వాతి ఆందోళన చెందుతున్నారు. శనివారం ఆమె నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన భర్త వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితునిగా రిమాండ్‌లో ఉన్నారన్నారు.

తన ఇంటిలో ఉన్న పెంపుడు కుక్కను ఎవరో ఉద్దేశపూర్వకంగా మాయం చేశారని, తనకైతే ఎవరి మీద అనుమానం లేదని ఆమె వెల్లడించారు. ఇంటిలోకి ఎవరిని రానివ్వకుండా, తనకు సహాయంగా ఉండేదని, కుక్క మాయం కావడంతో తాను భయభ్రాంతులకు గురౌతున్నానని ఆమె తెలిపారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో భయపడుతూ బతుకుతున్నానని ఆమె వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement