Saturday, April 20, 2024

ఐసీసీ ర్యాంకుల్లో అమ్మాయిల జోరు

మంగళవారం విడుదలైన ఐసీసీ టీ 20 మహిళల బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ ఇండియా ప్లేయర్‌ దీప్తిశర్మ రెండో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం వెస్టిండీస్‌ , సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ 20 ముక్కోణపు సిరీస్‌లో 9 వికెట్లు తీసి టాప్‌లో ఉన్న దీప్తి.. 739 పాయింట్లతో రెండో స్థానాన్ని చేరింది. ఇంగ్లండ్‌కు చెందిన సోఫీ ఎక్కలిస్టోన్‌ మొదటి స్థానంలో నిలిచింది. సోఫీకి దీప్తికి మధ్య పాయింట్ల అంతరం 26 మాత్రమే ఉంది. ఇదే ట్రై సిరీస్‌లో నాలుగు వికెట్లు తీసిన సౌతాఫ్రికన్‌ లెప్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ నోంకులులెకో వ్లూబా 732 పాయింట్స్‌తో మూడో స్థానాన్ని చేజిక్కించుకుంది.

వీరిద్దరూ తమ ఫామ్‌ ఇలాగే కొనసాగిస్తే ఫిబ్రవరి 10 నుంచి దక్షిణాఫ్రికాలో జరగనున్న మహిళల టీ 20 ప్రపంచకప్‌కు ముందే సోఫీ స్థానానికి ఎసరుపెట్టే అవకాశం ఉంది. కాగా మరో టీమ్‌ ఇండియా లెప్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ తన ర్యాంకు మెరుగుపరచుకుని 14వ స్థానానికి ఎగబాకింది. అయితే టాప్‌ 10 బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియన్‌ పేసర్‌ మెగాన్‌ షట్‌ ఆరు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకోగా ఇంగ్లండ్‌ సీమర్‌ కేథరిన్‌ స్కివర్‌ బ్రంట్‌ రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచింది.

- Advertisement -

మరో వైపు ఆస్ట్రేలియా కుడి చేతి వాటం ప్లేయర్‌ తహ్లియా మెక్‌ గ్రాత్‌ టీ 20 బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి సొంతం చేసుకుంది. టీమ్‌ ఇండియా ప్లేయర్‌ స్మృతి మందాన మూడో స్థానాంలో ఉంది. అయితే భారత్‌ – వెస్టిండీస్‌తో జరిగిన ముక్కోణపు సిరీ స్‌లో సౌతాఫ్రికా ప్లేయర్‌ లారా వోల్వార్డ్‌ నాలుగు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరుకోగా.. ఇదే టీమ్‌కు చెందిన తజ్మిన్‌ బ్రిట్స్‌ అర్థ సెంచరీ కొట్టి 10 స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకుంది. వెస్టిండీస్‌ కెప్టెన్‌ హేలీ మ్యాథ్యూస్‌ నాలుగు స్థానాలు ఎగబాకి 18వ స్థానానికి చేరుకుంది. వెస్టిండీస్‌ కెప్టెన్‌ హేలీ మ్యాథ్యూస్‌ నాలుగు స్థానాలు ఎగబాకి 22వ ర్యాంకుకు చేరుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement