Thursday, April 25, 2024

ఏపీలో తగ్గుతున్న కరోనా… కొత్త 10,413 కేసులు

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా 24 గంటలలో 85,311 సాంపిల్స్ ని పరీక్షించగా 10,413 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. కోవిడ్ వల్ల చిత్తూర్ లో పద్నాలుగు మంది, పశ్చిమ గోదావరి లో పదకొండు మంది, అనంతపూర్ లో ఎనిమిది, తూర్పు గోదావరి లో ఏడుగురు, శ్రీకాకుళం లో ఏడుగురు, గుంటూరు లో ఆరుగురు, కృష్ణ లో ఆరుగురు, విజయనగరం లో ఆరుగురు, కర్నూల్ లో
ఐదుగురు, విశాఖపట్నం లో ఐదుగురు, నెల్లూరు లో నలుగురు, ప్రకాశం లో ముగ్గురుమరియు వైఎస్ఆర్ కడప లో ఒక్కరు మరణించారు.

అలాగే గడచిన 24 గంటల్లో 15,469 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారు. నేటి వరకు రాష్ట్రంలో 1,96,19,590 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో…
మొత్తం కేసుల సంఖ్య -1738990
యాక్టీవ్ కేసులు – 133733
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 1593921
మొత్తం మృతుల సంఖ్య – 11296

Advertisement

తాజా వార్తలు

Advertisement