Thursday, April 25, 2024

ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు…మరణాలు మాత్రం అదే తీరు

ఏపీలో కేసులు తగ్గుతున్నా మరణాలు ఆగట్లేదు. గ‌డిచిన 24గంట‌ల్లో 98,048మందికి కరోనా పరీక్షలు చేయగా 12,768 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కొత్తగా 15,612మంది కరోనా నుంచి కొలుకున్నారు. అలాగే కొత్తగా మ‌రో 98మంది మృతి చెందారు.

తాజా గణాంకాల ప్రకారం ఏపీలో ప్ర‌స్తుతం1,43,795యాక్టివ్ కేసులుండ‌గా… ఇప్ప‌టి వ‌ర‌కు 11,132మంది మ‌ర‌ణించారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,17,156కు చేర‌గా, 15,62,229మంది ఇప్ప‌టి వ‌ర‌కు కోలుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement