Thursday, April 25, 2024

తగ్గిన కరోనా కేసులు.. కొత్త‌గా 7,591 మందికి పాజిటివ్‌

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 9 వేలకుపైగా కేసులు రికార్డవగా.. తాజాగా 7 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 27 గంటల్లో 7,591 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 9,206 మంది బాధితులు కోలుకున్నారు. మరో వైపు 45 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,44,15,723కు పెరిగింది. ఇందులో 4,38,02,993 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 84,931 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement