Thursday, April 25, 2024

గుర్తు తెలియ‌ని మృత‌దేహం : వీడిన మిస్ట‌రీ

హైదరాబాద్ వ‌న‌స్థలిపురం ఈనెల 16న లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం. ఈ కేసులో మిస్టరీ వీడింది. కాళ్లు కట్టేసి దారుణంగా కొట్టి చంపి మూటలో కట్టి పడేశారు నిందితులు. మృతుడు సూర్యాపేటకు చెందిన గుడిపాటి శ్రీనివాస్ (32)గా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ పీజీ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. ఈనెల 16న విజయపు రికాలనీలో శవమై కనిపించాడు. ఓ కార్డు, ఫింగర్ ప్రింట్ ఆధారంగా మృతుడు శ్రీనివాస్ గా గుర్తించినట్లు పోలీసులు.అతని హత్యకు గల కారణాలు తెలియరాలేదు.సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీ లిస్తున్నారు. కాల్ లీస్ట్, ఇతర ఆధారాలతో నింది తుల కోసం దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement