బంగాళాఖాతంలో ఏర్పడిన మండూస్ తుఫాను తీరం వైపు దూసుకొస్తున్నది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా చైన్నై ఎయిర్ పోర్ట్ కు పలు విమానాలు రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. ఇవాళ చెన్నై ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించాల్సిన విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. చెన్నై మహానగరంపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ తెలపడంతో ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం పార్కులు, ప్లే గ్రౌండ్లతోపాటు, డిసెంబర్ 10న చెన్నై మహా నగరంలోని స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని ఆదేశించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement