Saturday, April 20, 2024

జూన్ 23న కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథి

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంది. జూన్ 23న ఎన్నికలు నిర్వహించనున్నట్టు పార్టీ నేత ఒకరు చెప్పారు. ఎన్నిక ద్వారానే పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది. బాధ్యతలు చేపట్టాల్సిందిగా రాహుల్ ను పార్టీ నేతలు పలుమార్లు బతిమాలినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. అప్పటి నుంచి సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరగాల్సిన పార్టీ అధ్యక్ష ఎన్నికలను.. ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీడబ్ల్యూసీ వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement