Friday, April 19, 2024

పేస్టు రూపంలో కిలో బంగారం స్మగ్లింగ్

హైదరాబాద్: శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు కిలో బంగారం పట్టుకున్నారు. షార్జా నుంచి వచ్చిన వ్యక్తి వద్ద ఉన్న లగేజీని తనిఖీ చేయగా పేస్ట్‌ రూపంలో ఉన్న పసిడిని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌) తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.43.55 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కాగా షార్జా నుంచి వచ్చిన ప్రయాణికుడిని విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా గురువారం దాదాపు అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు శుక్రవారం కిలో బంగారం పట్టుకోవడం గమనార్హం.

ఈ వార్త కూడా చదవండి: రకుల్‌ను 7 గంటలు విచారించిన ఈడీ

Advertisement

తాజా వార్తలు

Advertisement