నాగచైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ సినిమా కస్టడీ. తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతోంది.శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేశారు. ప్రస్తుతం పో స్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా మాస్ట్రో ఇళయరాజాను చిత్ర బృందం కలిసింది. రాజా లైవ్ ఇన్ కాన్సర్ట్ కోసం ఇళయరాజా హైదరాబాద్ వచ్చారు. ఆయ నను కస్టడీ చిత్ర బృందం కలిసి అభినందించింది. సినిమాకు తన కుమారుడితో కలిసి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా నాగచైతన్య పంచుకున్నారు. ఇళయరాజా గారిని కల వడం గొప్ప సంతోషాన్ని ఇచ్చింది. ఆయన పాటలు వింటూ జీవితంలో చాలా ప్రయాణాలు చేశాను. ఇప్పుడు కస్టడీ సిని మా కోసం పాటలు కంపోజ్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు. కృతి శెట్టి నాయికగా నటిస్తున్న కస్టడీలో అరవింద్ స్వామి విలన్గా నటిస్తున్నారు. ప్రియమణి, శరత్కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ ఇతర ముఖ్యపాత్రధారులు. కస్టడీ మే 12న విడుదలవుతుంది.
ఇళయరాజాతో కస్టడీ టీమ్..
Advertisement
తాజా వార్తలు
Advertisement