Friday, April 26, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 12 గంట‌ల స‌మ‌యం..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నాకి భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతుంది. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం 13 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచివున్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం ప‌డుతుంద‌ని అధికారులు తెలిపారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న వారి సంఖ్య 69,383 మంది భక్తులు కాగా.. 32,391 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్క‌రోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement