Friday, April 19, 2024

రూ.300కోట్ల మార్క్ ని దాటిన.. వార‌సుడు

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన చిత్రం వార‌సుడు. తమిళంలో వారిసుగా రిలీజ్ అయింది. జనవరి 11వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. అప్పటి నుంచి తన జోరును కొనసాగిస్తూ వెళ్లిన ఈ సినిమా 300 కోట్ల మార్కును దాటేసింది. మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ పోస్టర్ ను వదిలారు. దిల్ రాజు నిర్మాణ విలువలకు సంబంధించిన విషయంలో ఎక్కడా రాజీ పడలేదనే విషయం ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో ప్రతి చిన్న పాత్రలోను స్టార్స్ నే పెట్టారు. అలా ఈ సినిమా భారీతనాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. అలాగే పిక్చర్ క్వాలిటీ పరంగా కూడా ఈ సినిమా ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచింది. త‌మిళ స్టార్ హీరో విజయ్ సరసన కథానాయికగా రష్మిక నటించిన ఈ సినిమాలో, జయసుధ .. శరత్ కుమార్ .. ప్రకాశ్ రాజ్ .. సుమన్ .. ప్రభు .. ‘కిక్’ శ్యామ్ ముఖ్యమైన పాత్రలలో కనిపించారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement