Wednesday, March 27, 2024

కుంగిన రోడ్డు.. ఒరిగిన సిటీ బ‌స్సు

ఒక్క‌సారిగా రోడ్డు కుంగిపోయింది. దాంతో పెద్ద‌గా గొయ్యి ఏర్ప‌డింది. కాగా ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఓ సిటీ బ‌స్సు ఆ గోతిలో ఇరుక్కుపోయింది. ఈ సంఘ‌ట‌న దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వాహనాల రాకపోకలతో రద్దీ కొనసాగుతుండగా హాజ్‌ రాణి రెడ్‌ లైట్ సమీపంలోని ప్రెస్‌ ఎన్‌క్లేవ్‌ రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు రోడ్డుకు ఇంకొంచం ఎడమవైపునకు వచ్చి ఉంటే గొయ్య ఇంకా పెద్దగా ఏర్పడేది, బస్సు పూర్తిగా గోతిలో పడిపోయేది. అదే జరిగి ఉంటే బస్సులోని ప్రయాణికుల్లో చాలా మందికి గాయాలు అయ్యేవి. సాకేత్ కోర్టు నుంచి మాలవీయ నగర్‌ పీటీఎస్ కు వెళ్లే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు చెప్పారు. రోడ్డు కుంగడం తో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement