Friday, April 19, 2024

రికార్డు క్రియేట్ చేసిన.. పఠాన్ టీజర్

పఠాన్ మూవీ టీజర్ రికార్డుని క్రియేట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌లో అత్యధిక మంది వీక్షించిన, లైక్‌ చేసిన టీజర్‌కు రికార్డు క్రియేట్‌ చేసింది. టీజర్‌తోనే సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్‌రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా యష్‌రాజ్‌ ఫిలింస్‌లో 50వ చిత్రం కావడం విశేషం. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్‌ అబ్రహం కీలకపాత్రలో నటించాడు.నాలుగేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు షారుఖ్ మూడు సినిమాల‌ను సెట్స్‌పై ఉంచాడు. అందులో పఠాన్‌ ఒకటి. సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శక‌త్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement