Thursday, March 28, 2024

Latest Update | పరశురామ్ దర్శకత్వంలో మరోసారి.. రౌడీబోయ్​ విజయ్ దేవరకొండ నెక్ట్స్​ ప్రాజెక్టుపై క్రేజీ బజ్​

రౌడీ బొయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి మూవీ చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా అతి త్వరలో దీని తదుపరి షెడ్యూల్ జరుగనుంది. రొమాంటిక్, లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు శివ నిర్వాణ అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్తోంది యూనిట్.

ఇక.. దీని తరువాత ఇప్పటికే గౌతమ్ తిన్ననూరితో ఒక మూవీ అనౌన్స్ చేశాడు విజయ్ దేవరకొండ. అయితే దాని అనంతరం ప్రముఖ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో విజయ్ దేవరకొండ ఒక భారీ మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇది సినీ వర్గాల నుంచి అందుతున్న లేటెస్ట్ అప్​డేట్​.. కొద్ది సేపటి క్రితం విజమ్ దేవరకొండ కూడా అఫీషియల్ గా సోషల్ మీడియాలో ఎనౌన్స్ చేసినట్టు సమాచారం..

ఇటీవల విజయ్ తో గీత గోవిందం వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ ఆల్మోస్ట్ పూర్తి అయ్యిందని, అతి త్వరలో మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement