Monday, March 25, 2024

మిరాజ్ క్రాష్ డౌన్.. పైల‌ట్‌ ఏం చేశాడో తెలుసా!

భారత వాయుసేనకు చెందిన మిరాజ్-2000 శ్రేణికి చెందిన ఓ ఎయిర్ క్రాఫ్ట్ మధ్యప్రదేశ్ లో నేలకూలింది. బింద్ జిల్లాలోని మనకాబాద్ వద్ద నిర్జన ప్రదేశంలో ఇది ప‌డిపోయింది.

రోజువారీ శిక్షణలో భాగంగా ఎయిర్ బేస్ నుంచి నింగికి ఎగిరిన మిరాజ్ యుద్ధ విమానం కొద్దిసేపట్లోనే గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ తో సంబంధాలు కోల్పోయింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్, ఫ్లైట్ లెఫ్ట‌నెంట్ తప్పించుకున్నార‌ని పోలీసులు తెలిపారు. పైలెట్ అభిలాష్ సురక్షితంగా ఉన్నాడని భారత వాయుసేన ఓ ప్రకటనలో తెలిపింది. విమానం ప‌డిపోయిన ప్ర‌దేశాన్ని ఎస్పీ మ‌నోజ్ సింగ్ ప‌రిశీలించారు. సాంకేతిక లోపం వల్లే విమాన ప్రమాదం జరిగి ఉంటుందని వాయుసేన వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement