Saturday, April 20, 2024

ట్రాక్టర్ ఇసుకను రూ.1000కే ఇవ్వాలి

ఏపీలో ట్రాక్టర్ ఇసుకను రూ.1000కే ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ రాశారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో ఇసుక కొరతను సృష్టించారని మండిపడ్డారు. రాష్ట్రం మొత్తం మీద భవన నిర్మాణ రంగం కుదేలైందని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక, వినియోగదారులకు ఇసుక దొరకక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు ఇసుక సరఫరా కాంట్రాక్ట్‌ను దివాలా తీసిన కంపెనీకి అప్పగించటం ఆశ్చర్యకరమన్నారు. ఇందులో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా వస్తున్న వార్తలకు సమాధానం చెప్పాలని లేఖలో రామకృష్ణ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement