Saturday, March 23, 2024

బీజేపీకి ఎందుకెయ్యాలి ఓట్లు?

ఏపీ బీజేపీ నేతలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని పార్లమెంటు సాక్షిగా కేంద్రం మరోమారు స్పష్టం చేసిందని, అలాంటప్పుడు ఏ ముఖం పెట్టుకుని తిరుపతిలో ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చనందుకు ఓట్లు వెయ్యమని అడుగుతారా? అని మండిపడ్డారు. ఏపీకి పదేపదే అన్యాయం చేస్తున్నందుకు ఓట్లు వేయాలని ప్రజలను అడుగుతారా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని నట్టేట ముంచుతున్న బీజేపీని పవన్ కల్యాణ్ ఇప్పటికైనా విడిచిపెట్టాలని రామకృష్ణ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement