Thursday, April 25, 2024

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌’లో పాల్గొన్న సీపీఐ నారాయణ

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విజయవంతంగా ముందుకు సాగిపోతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, సినీ తారలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా సీపీఐ సీనియర్ నేత నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.

తన పుట్టిన రోజును పురస్కరించుకుని స్వగ్రామమైన చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని అయినంబాకంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామస్తులు ప్రతి ఒక్కరూ ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ వంటి మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకువెళ్తున్న రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్‌ను నారాయణ అభినందించారు.

ఈ వార్త కూడా చదవండి: కొవిషీల్డ్ టీకాతో 93 శాతం రక్షణ

Advertisement

తాజా వార్తలు

Advertisement