Friday, March 29, 2024

ఏపీకి చేరుకున్న 3.6 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు

ఏపీకి మరికొన్ని కొవిషీల్డ్ టీకాలు చేరుకున్నాయి. రాష్ట్రానికి మరో 3.60 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. మహారాష్ట్ర పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. వాటిని టీకా కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి జిల్లాలకు పంపనున్నారు. వ్యాక్సిన్ కొరతతో 45 ఏళ్లు దాటిన వారికి మాత్రమే టీకా ఇస్తున్నారు. రెండో డోసు వేయించుకునే వారికి ప్రాధాన్యత ఇస్తామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.

మరోవైపు కర్ణాటక ప్రభుత్వానికి 6.5 లక్షల డోసుల కొవిషీల్డ్ టీకాలు అందినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1.1 కోట్ల డోసులు ఆర్డర్ ఇవ్వగా కేంద్రం కేవలం 6.5 లక్షల డోసులు మాత్రమే పంపినట్లు కర్ణాటక అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement