Friday, April 19, 2024

కొత్త‌గా 2,202పాజిటీవ్ కేసులు

క‌రోనా కేసులు మ‌ళ్ళీ పెరుగుతున్నాయి. కాగా దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 2,202 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. ఈ మ‌హ‌మ్మారి నుంచి మ‌రో 2,550 మంది కోలుకున్న‌ట్లు తెలిపింది. మ‌రో 27 మంది చ‌నిపోయారు. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 17,317 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీక్లీ పాజిటివిటి రేటు 0.59 శాతంగా ఉంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 191.37 కోట్ల క‌రోనా టీకా డోసులు పంపిణీ చేయ‌గా, ఇందులో 12 నుంచి 14 ఏండ్ల పిల్ల‌ల‌కు 3.17 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement