Tuesday, April 23, 2024

Covid Update : దేశంలో త‌గ్గిన క‌రోనా.. కొత్త కేసులు వెయ్యిలోపే..

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుతుంది. మొన్న‌టిదాకా వెయ్యి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య నేడు వెయ్యికి దిగువ‌న న‌మోద‌వుతున్నాయి. వ‌రుస‌గా మూడు రోజులుగా వెయ్యిలోపే న‌మోద‌వుతుండ‌డంతో మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు అంటున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా 811 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,62,952కి చేరింది. ప్రస్తుతం దేశంలో 13,559 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,18,882 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,511కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement