దేశంలో కరోనా కేసులు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. మొన్నటి రెండు వేలు దాటిన కేసుల సంఖ్యం నిన్నటి నుంచి వెయ్యి వరకు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉందని వైద్యులు అంటున్నారు. గడిచిని 24 గంటల్లో 83167 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1326 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో కొత్తగా 1326 మందికి కరోనా వచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,53,592కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 1,723 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 17,912 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా కారణంగా ఎనిమిది మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,29,024కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement