Tuesday, April 23, 2024

కరోనా రోగులు ఏ సాయం కావాలన్నా ఇలా చేయండి

కరోనా కష్టకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయి. టీమ్ హోప్‌లెట్ సంస్థ కూడా కరోనా బారిన పడ్డ రోగులకు ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందిస్తోంది. కరోనా పేషెంట్లకు ఐసోలేషన్, ఫుడ్, బెడ్, మెడిసిన్.. ఇలా ఏ విషయంలో సమాచారం కావాలన్నా 92205 92205 నంబరుకు SMS చేయండి. మీకు ఏ సర్వీస్ కావాలో దానిని మెన్షన్ చేస్తూ కింది విధంగా SMS చేస్తే దాతలు మిమ్మల్ని సంప్రదించి సహాయం అందిస్తారు.

అదే విధంగా తమ ప్రాంతంలోని కోవిడ్ పేషెంట్లకు ఏ సహాయం కావాలన్నా దాతలు కూడా స్పందించే అవకాశాన్ని కోవిడ్ పేషెంట్లకు టీమ్ హోప్‌లెట్ అందిస్తోంది. దాతలు https://covid-saathi.org వెబ్‌సైట్‌ను సంప్రదించి పేషెంట్లకు కావాల్సిన సహాయం అందించవచ్చని టీమ్ హోప్‌లెట్ వెల్లడించింది. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించగలరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement