Thursday, March 28, 2024

కొవిడ్ ఎఫెక్ట్.. 15 రోజులు సెల‌వు ప్ర‌వ‌టించిన మ‌హీంద్రా యూనివ‌ర్సిటీ..

మ‌ల్లీ విజ్రుంబిస్తున్న కోవిడ్.. అధికారికంగా 15 రోజులు సెల‌వు ప్ర‌వ‌టించిన మ‌హీంద్రా యూనివ‌ర్సిటీ..

కుత్బుల్లాపూర్‌, ప్రభ న్యూస్‌: కరోనా దెబ్బతో మహీంద్రా యూనివర్సిటీ తమ విద్యా ర్థులకు 15 రోజుల పాటు సెలవులు ప్రకటించింది. మహీంద్రా యూనివర్సీటీలో 25 మంది విద్యార్థులు, ఐదుగురు టీచింగ్‌ స్టాఫ్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. గురువారమే యూనివర్సిటీ విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌ అని తెలిసినా మరోమారు దుండిగల్‌ పీహెచ్‌సీ వైద్యాధికారులతో కొవిడ్‌ టెస్టులు చేయించారు.

ఇందులోనూ 25 మంది విద్యార్థులకు, ఐదుగురు టీచింగ్‌ స్టాఫ్‌కు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వైద్యాధికారుల సూచన మేరకు శుక్రవారమే కొవిడ్‌ సోకిన విద్యార్థులతోపాటు టీచింగ్‌ స్టాఫ్‌ను హోమ్‌ ఐసోలేషన్‌కు తరలించారు. అనంతరం యూనివర్సిటీ పరిసరాలన్నీ శానిటైజేషన్‌ చేయించారు. మహీంద్రా యజమాన్యం తమ విద్యార్థులకు అధికారికంగా పదిహేను రోజుల పాటు సెలవులు ప్రకటించింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement