Saturday, April 20, 2024

ఢిల్లీ క్యాపిట‌ల్స్ లో కొవిడ్ క‌ల‌క‌లం.. వారం పాటు క్వారంటైన్‌

ఐపీఎల్ 15వ సీజన్‌లో ఇప్ప‌టికి 24 మ్యాచ్‌లు జ‌రిగాయి.. అయితే 25వ మ్యాచ్‌కు ముందు టోర్నమెంట్‌లో మొదటి కరోనా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లోని ఒక ముఖ్యమైన సభ్యుడు క‌రోనా బారినపడ్డాడు. ప్రస్తుతం అతన్ని DC మెడికల్ టీమ్ నిశితంగా పరిశీలిస్తోంది. అని అధికారిక IPL త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఢిల్లీ క్యాపిటల్స్ వారి తదుపరి మ్యాచ్‌ను శనివారం ఆడాల్సి ఉంది, కానీ అంతకు ముందు, ఆ జట్టు ఫిజియో ప్యాట్రిక్ ఫర్‌హార్ట్ క‌రోనా పాజిటివ్‌గా గుర్తించారు. ప్రస్తుతానికి, అతను జట్టుతో కలిసి ప్రయాణించడం లేదు. అతను కనీసం ఒక వారం పాటు క్వారంటైన్‌లో ఉండవలసి ఉంటుంది. ఇది కాకుండా, ఐపిఎల్ 2022లో ఇప్పటివరకు ఎటువంటి కరోనావైరస్ కేసు నమోదు కాలేదు. అని టీమ్ మేనేజ్‌మెంట్ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement