Friday, March 29, 2024

దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కొవిడ్​ కేసులు.. పలు రాష్ట్రాలు అప్రమత్తం

కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో పది రోజుల్లోనే 241 శాతం కేసులు అమాంతం పెరిగాయి. జూన్ మూడో తేదీన 5,127 కేసులు ఉండగా.. ఆ సంఖ్య ప్రస్తుతం 17 వేల 480కి పెరిగింది. ప్రస్తుతం మరణాల రేటు 1.86 శాతంగా ఉంది. దీంతో కరోనా వైరస్ మళ్లీ వేగం అందుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాది మే నెలలో 9,354 కోవిడ్ కేసులు నమోదు కాగా అందులో ముంబై నుంచి 5,980 కేసులు ఉన్నట్టు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మధ్య కాలంలో కోవిడ్ బారిన పడుతున్న వారిలో స్వల్ప లక్షణాలే మాత్రమే ఉంటున్నాయి. క‌రోనా బారిన‌ప‌డి ఆస్పత్రిలో జాయిన్ అయ్యే కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయి. అయినా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

కరోనా కేసులు పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల్లోని వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. చండీగఢ్ అధికారులు సోమవారం ఓ హెల్త్ అడ్వైజరీని కూడా జారీ చేశారు. తాజాగా అక్కడ 46 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 4 నెలల తర్వాత కేసులు పెరగడంతో.. అధికారులు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు. కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లను ధరించాలని పేర్కొన్నారు. మరోవైపు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి… రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకునేలా చేయాలని సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement