Friday, April 19, 2024

తిరుమ‌ల వేద పాఠ‌శాల‌లో పెరుగుతున్న కరోనా కేసులు

తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 10మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో వైర‌స్ సోకిన వారి సంఖ్య 67కు చేరింది. పాఠ‌శాల‌లో ఉంటున్న ఆరుగురు విద్యార్థులతో పాటు న‌లుగురు అధ్యాప‌కుల‌కు క‌రోనా సోకిన‌ట్లు నిర్ధార‌ణ అయ్యింది. ఇక ఇదే పాఠశాలలో ఈనెల 10న 57 మంది విద్యార్థుల‌కు క‌రోనా సోకింది. వారిని ప‌ద్మావ‌తి కోవిడ్ సెంట‌ర్‌కు త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు. ఐదు రోజుల త‌ర్వాత మ‌రోసారి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, మ‌రో 10మంది వైర‌స్ బారిన‌ప‌డ్డారు. వేద పాఠ‌శాల‌లో తెలుగు రాష్ట్రాల‌తో పాటు క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడుకు చెందిన 420మంది విద్యార్థుల వరకు వేద విద్య‌న‌ు అభ్య‌సిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement