Thursday, April 18, 2024

Delhi | కోర్టు తీర్పు రాజకీయ ప్రేరేపితం- మాజీ ఎంపీ చింతా మోహన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ ప్రేరేపితమని కాంగ్రెస్ మాజీ ఎంపీ డా. చింతామోహన్ విమర్శించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తొందరపాటుతో ఇచ్చిన తీర్పుగా అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం కూడా తొందరపాటు చర్య అని చింతా మోహన్ ఆరోపించారు. సూరత్ మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు ఉన్నత న్యాయస్థానాల్లో చెల్లుబాటు కాదని నొక్కి చెప్పారు. పరువు నష్టం చట్టంలో రాజకీయ విమర్శలు చేయవచ్చని స్పష్టంగా ఉందని ఆయన అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement