తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం సమీపంలో కృష్టా జిల్లాకు చెందిన భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. నరేష్, సరస్వతి దంపతులు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయి ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
కరోనా నేపథ్యంలో ఇప్పుడు సీఎంను కలవడం కుదరదని పోలీసు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. వినతి పత్రం ఇస్తే దానిని సీఎంకు అందిస్తామని చెప్పారు. దీంతో వారిద్దరూ పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన చెక్పోస్టు సిబ్బంది వారిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఫిట్స్తో ఇబ్బంది పడిన బాధిత మహిళను తాడేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.