Tuesday, April 23, 2024

లోన్ యాప్ వేధింపులతో.. దంపతుల ఆత్మహత్య

లోన్ యాప్ వేధింపులతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో రెండు యాప్ లలో దుర్గారావు అప్పు చేశారు. అయితే దుర్గారావు ఇప్పటికే కొన్ని డబ్బులు చెల్లించాడు. మిగిలిన డబ్బుల కోసం యాప్ నిర్వాహకులు వేధించారు. దుర్గారావు భార్య ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేశారు. సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. అసభ్యకర ఫోటోలను నిర్వాహకులు వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేశారు. దీంతో లాడ్జిలో విషం తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement