Thursday, April 18, 2024

ప్రేమజంట ప్రాణం తీసిన సెల్ఫీ

ఇప్పటికే సెల్ఫీ మోజులో పడి ఎందరో ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి. తాజాగా కర్ణాటకలో సెల్ఫీ సరదా ఓ ప్రేమజంట ప్రాణాలను బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీదర్‌లోని ఓ కాలేజీలో బీఏ చదువుతున్న పురుషోత్తం పాటిల్.. గుల్బర్గాలో ఇంజనీరింగ్ చదువుతున్న తన ప్రియురాలు రక్షితతో కలిసి కాలక్షేపం కోసం విహారయాత్రకు వెళ్లాడు. అయితే ఆటోలో దాండేలి నుండి జోయిడా వద్ద అంబికానగర్‌లోని గణేష్ ఆలయం సమీపంలోని వంతెన వద్దకు వచ్చారు. అక్కడ ఎవరూ లేని సమయంలో తమ ఫోన్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా జారి నదిలో పడిపోయారు. మంగళవారం ఉదయం రెండు మృతదేహాలు కనిపించడంతో అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వీరు ప్రమాదవశాత్తు పడ్డారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో విచారణ చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement