Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 11,850 కరోనా కేసులు, 555 మరణాలు

దేశంలో కొత్తగా 11,850 కరోనా కేసులు నమోదవగా, 555 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,26,036కు చేరగా, మృతులు 4,63,245కు పెరిగారు. ఇప్పటివరకు 3,38,26,483 మంది కరోనా నుంచి బయటపడగా, 1,36,308 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కాగా, గత 24 గంటల్లో కొత్తగా 12,403 మంది కరోనా నుంచి బయటపడ్డారు. నిన్న ఒకేరోజు 58,42,530 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. దీంతో మొత్తం 1,11,40,48,134 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement