Tuesday, April 23, 2024

పెళ్లికి రాలేక‌పోయాం.. క్ష‌మించండి.. ఉపాస‌న‌

పెళ్లికి రాలేక‌పోయినంద‌కు సారీ చెప్పారు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న‌. బాలీవుడ్‌ కొత్త జంట కియారా అడ్వాణీ-సిద్ధార్థ్‌ మల్హోత్రకు క్షమాపణలు చెప్పారు. వీరి వివాహం మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో గల సూర్యగ్రహ్‌ ప్యాలెస్‌లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. అయితే, ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను కియారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇవి చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాసన కియారా-సిద్ధార్థ్‌ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లికి రాలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement