Thursday, April 25, 2024

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో కార్పొరేట్ స్థాయి వ‌స‌తులు : మంత్రి హ‌రీశ్ రావు

మ‌న ఊరు – మ‌న బ‌డి కార్య‌క్ర‌మంలో భాగంగా ఆధునిక వ‌స‌తులు క‌ల్పించిన అనంత‌రం 700 ప్రభుత్వ పాఠశాలలను ఒకే రోజు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంద‌ని, ఈ ప్రోగ్రామ్‌కు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టార‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ప్ర‌గ‌తి న‌గ‌ర్‌లో మండ‌ల ప‌రిష‌త్ ప్రైమ‌రీ పాఠ‌శాల‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. మ‌న ఊరు – మ‌న బ‌డితో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో కార్పొరేట్ స్థాయి వ‌స‌తులు క‌ల్పించామ‌న్నారు. ఒక వైపు నాణ్య‌మైన బోధ‌న అందిస్తూనే, మ‌రో వైపు వ‌స‌తుల క‌ల్ప‌న చేప‌ట్టామ‌న్నారు. విద్యార్థుల‌కు ఇంగ్లీష్ మీడియంలో బోధ‌న ప్రారంభించామ‌న్నారు. డిజిట‌ల్ క్లాసులు పిల్ల‌ల‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతాయ‌న్నారు. 9 వేల మంది టీచ‌ర్ల‌కు ప్ర‌మోష‌న్లు ఇవ్వ‌బోతున్నాం. ప్ర‌మోష‌న్లు పూర్తి కాగానే టీచ‌ర్ల భ‌ర్తీ ప్ర‌క్రియ చేప‌ట్ట‌బోతున్నామ‌ని చెప్పారు. ఉపాధ్యాయులు పిల్లలకు సామాజిక అంశాలపై అవగాహన పెంచాల‌ని మంత్రి హ‌రీశ్‌రావు సూచించారు. ప్రభుత్వ పాఠశాల‌ల్లో చదివిన విద్యార్థులు ఐఐటీ ర్యాంకులు సాధించాలి. ఎంబీబీఎస్ సీట్లు పొందాలి, అత్యున్నత స్థాయికి ఎదగాలని మంత్రి హ‌రీశ్‌రావు ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement