Saturday, April 20, 2024

స్పెయిన్‌ బుల్‌ నాదల్‌కు కరోనా..

అబుదాబి ఎగ్జిబిషన్‌ ఈవెంట్‌లో పాల్గొన్న స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని నాదల్ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు. కొంతకాలం విరామం తరాత అబుదాబిలో జరిగిన ఈవెంట్‌లో నాదల్‌ పాల్గొన్నాడు. తొలి రౌండులోనే ఓటమితో స్వదేశం స్పెయిన్‌కు చేరుకున్నాడు. అక్కడ అతడికి చేసిన వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా వైద్యపరీక్షలు చేయాల్సిందిగా నాదల్‌ కోరాడు.

పీసీఆర్‌ టెస్టులో కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. తను కోలుకుంటున్నట్లు నాదల్‌ తెలిపాడు. కాగా 20గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత అయిన నాదల్‌.. గాయం కారణంగా విరామం తీసుకున్నాడు. అబుదాబి వేదికగా జరిగిన ముబదాలా వరల్డ్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో పునరాగమనం చేసినా ముర్రే చేతిలో ఓటమితో నిష్క్రమించాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement