Friday, April 19, 2024

కేంద్ర విద్యా శాఖ మంత్రికి కరోనా పాజిటివ్

కరోనా సెకండ్ వేవ్ లో సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ మహమ్మారి బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

డాక్టర్ల సూచనలతో చికిత్స తీసుకుంటూ మెడిసిన్ వాడుతున్నానని ఇటీవల కాలంలో తనను కలిసిన అధికారులు స్నేహితులు అందరూ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement