Friday, March 29, 2024

వైరస్ కోసమా, ప్రజల కోసమా త్వరలోనే తెలుస్తుంది..వర్మ సెటైర్

తెలంగాణ లో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంపై క్రేజీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సెటైరికల్ కామెంట్ చేశాడు. లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంపై వేచి చూడాల్సి ఉందని, ఆంక్షలు ఎత్తివేసింది వైరస్ కోసమా, లేక ప్రజల కోసమా అనేది త్వరలోనే తెలుస్తుందని సెటైర్ వేశారు. అంతకుముందు తాను చేసిన కొన్ని ట్వీట్లలో వర్మ విమర్శనాత్మకంగా స్పందించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే లాక్ డౌన్ ఎత్తివేస్తున్నామని, ఆకలి చావులను నివారించడానికే ఆంక్షలు తొలగిస్తున్నామని ప్రభుత్వం ప్రజలకు గట్టిగా చెప్పాలని ఆకాంక్షించారు. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కొవిడ్ ముగిసినట్టు కాదని వర్మ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement