Thursday, March 28, 2024

దేశంలో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా.. ఏడు వేలు దాటిన యాక్టివ్‌ కేసులు

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,134 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,98,118 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 7,026 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,30,813కి చేరింది. దేశ వ్యాప్తంగా 4,41,60,279 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement