Thursday, April 25, 2024

ఒకే కాలేజీలో 66మంది మెడికోలకు కరోనా.. ఎక్క‌డంటే..

బెంగళూరు-కర్నాటకలోని ధర్వాడ్ ప్రాంతంలోని ఒక మెడికల్ కాలేజీలో 66మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. ధర్నాడ్ లోని ఎస్ డీ ఎమ్ మెడికల్ సైన్సెస్ లో ఇటీవల వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 300మంది విద్యార్థులకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

వారిలో 66మందికి పాజిటివ్ వచ్చింది. వీరందరూ ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్నారు. అయినప్పటికీ వైరస్ బారినపడ్డారు. మరో వందమంది విద్యార్థులకు కరోన నిర్ధారణ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని డిప్యూటీ కమిషనర్ నితిష్ పాటిల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement