Wednesday, April 24, 2024

కరోనా ఎఫెక్ట్: భార్యను ట్రాలీలో తీసుకెళ్లిన భర్త

కరోనా మహమ్మారి కారణంగా కుటుంబాలు తీవ్రస్థాయిలో ప్రభావితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, మిజోరాం రాష్ట్రంలో ఓ వ్యక్తి తన భార్యకు కరోనా సోకడంతో, ఆమెను ఐసోలేషన్ కేంద్రానికి తీసుకెళ్లేందుకు వినూత్నంగా ఆలోచించాడు. ఎంత భార్య అయినప్పటికీ దగ్గరికి వెళితే కరోనా సోకుతుంది… అందుకే, తన జీప్ వెనుక ఓ ట్రాలీని అమర్చాడు. ఆ ట్రాలీలో ఓ కుర్చీ ఏర్పాటు చేసి భార్యను అందులో కూర్చోబెట్టాడు. ఆపై ఎంచక్కా భార్యను ఐసోలేషన్ కేంద్రానికి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ ఐపీఎల్ అధికారి సోషల్ మీడియాలో పంచుకోగా, నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement