Thursday, April 25, 2024

ఏపీలో కరోనా తగ్గుముఖం….కొత్తగా 6952 కేసులు

ఏపీలో ప్రతిరోజు కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,08,616 సాంపిల్స్ ని పరీక్షించగా 6,952 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. అలాగే కోవిడ్ వల్ల ప్రకాశం లో పదకొండు మంది, చిత్తూర్ లో తొమ్మిది, తూర్పు గోదావరి లో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, విశాఖపట్నం లో ఐదుగురు, శ్రీకాకుళం లో నలుగురు, పశ్చిమ గోదావరి లో నలుగురు, కర్నూల్ లో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు, వైఎస్ఆర్ కడప లో ఒక్కరు మరియు నెల్లూరు లో ఒక్కరు మరణించారు.

గడచిన 24 గంటల్లో 11,577 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. ఇక మొత్తం నేటి వరకు రాష్ట్రంలో 2,03,48,106 సాంపిల్స్ ని పరీక్షించారు.

మొత్తం కేసుల సంఖ్య 1803074
యాక్టీవ్ కేసుల సంఖ్య 91417
కొలుకున్నవారి సంఖ్య 1699775
మృతి చెందిన వారి సంఖ్య 11882

Advertisement

తాజా వార్తలు

Advertisement