Friday, April 19, 2024

దేశవ్యాప్తంగా నిన్న 3 లక్షల 60 వేల కరోనా కేసులు..

దేశంలో కరోనా విలయతాండం కొనసాగుతూనే ఉంది. విచ్చలవిడిగా వ్యాపిస్తున్న ఈ వైరస్‌కు నిత్యం వేల మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ప్రతి రోజూ లక్షల మందిపై ప్రతాపం చూపుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 3,68,147 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా..3,417 మంది మృతి చెందారు. అలాగే 24 గంటల్లో 3,00,732 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,99,25,604కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య 16,29,3003గా ఉంది. ప్రస్తుతం 34,13,642 యాక్టీవ్ కేసులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా కరోనాతో మొత్తం 2,18,959 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement